సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఒకో అప్డేట్ తో మరింత హైప్ ని సెట్ చేసుకుంటుండగా మేకర్స్ ఈ మే 30 రిలీజ్ కి సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ చిత్రం ఆ డేట్ లో రాకపోవచ్చు అనే టాక్ కూడా వచ్చింది. మరి ఫైనల్ గా ఈ రూమర్స్ పై అఫీషియల్ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది.
దీని ప్రకారం ఈ జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసేసారు. అయితే ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితులు రీత్యా ఆ డేట్ కి వాయిదా వేస్తున్నామని లేదంటే మే 30నే విడుదల చేసేందుకు తాము స్టిక్ అయ్యి ఉన్నామని కానీ పరిస్థితులు ప్రభావం రీత్యా మార్చాల్సి వచ్చింది అని తెలిపారు. సో మొత్తానికి కింగ్డమ్ రాక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ జూలై 4 నుంచి ఉండనుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
#KINGDOM and its Arrival ‼️
JULY 04th, 2025 ????@TheDeverakonda @anirudhofficial @gowtam19 #BhagyashriBorse @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @NeerajaKona @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @AdityaMusic pic.twitter.com/ASQbpCJUs9— Sithara Entertainments (@SitharaEnts) May 14, 2025