క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌజ్ సుకుమార్ రైటింగ్స్పై ప్రొడ్యూస్ చేసిన తొలి చిత్రం ‘కుమారి 21F’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ మేజర్ అట్రాక్షన్గా నిలవడంతో ఈ మూవీ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక 2015లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతుండటంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తుంది. అంతేగాక, ఈ చిత్రాన్ని గ్రాండ్ రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. దీంతో ‘కుమారి 21F’ రీ-రిలీజ్ ఎప్పుడు ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.