‘సాయి పల్లవి’ పై సందీప్‌ రెడ్డి కామెంట్స్ వైరల్ !

‘సాయి పల్లవి’ పై సందీప్‌ రెడ్డి కామెంట్స్ వైరల్ !

Published on Feb 3, 2025 11:01 AM IST

నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘తండేల్‌’. ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, సాయి పల్లవి పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో హీరోయిన్ కోసం మొదట సాయిపల్లవిని అనుకున్నాను. ఓ మలయాళ కోఆర్డినేటర్ తో కూడా మాట్లాడాను’ అని అప్పటి సంగతులు చెప్పాడు సందీప్.

సందీప్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని అతనికి చెప్పాను. అతను వెంటనే.. ‘రొమాంటిక్ సీన్స్ కాదు కదా, సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ కూడా ధరించదని, ఆమె నీ మూవీ చేయదని, ఆమె గురించి ఆలోచించడం మానుకో’ అని అతను నాకు చెప్పాడు. సహజంగా పెద్ద అవకాశాలు వస్తుంటే హీరోయిన్లు మారిపోతుంటారు. కానీ, సాయి పల్లవి మారలేదు. అప్పటికీ ఇప్పటికీ సాయిపల్లవి ఒకేలా ఉన్నారని సందీప్ రెడ్డి వంగా ఆమెను అభినందించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు