స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ ప్రెస్మీట్లో హీరో వెంకటేష్ టాలీవుడ్లో జరుగుతున్న ఐటీ రైడ్స్, తన రెమ్యునరేషన్పై కామెంట్స్ చేశారు. టాలీవుడ్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా.. అంటూ సరదాగా తనకు తెలియనట్లుగా నవ్వుతూ కామెంట్ చేశారు. అటు తన రెమ్యునరేషన్పై కూడా వెంకీ ఇలానే స్పందించారు. తాను అంతా వైట్లోనే తీసుకుంటానని.. మిగతా హీరోల గురించి తనకు తెలియదని వెంకీ సెటైరిక్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం వెంకటేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేశారు.