ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందుతున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’

ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందుతున్న ‘గుండెజారి గల్లంతయ్యిందే’

Published on Apr 21, 2013 9:20 AM IST
First Posted at 09:20 on Apr 21st

GJG

నితిన్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ సినిమా విడుదలై రెండు రోజులవుతుంది. ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ ను నమోదు చేసుకుంది. ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే కాకుండా యు.ఎస్ లో కూడా మంచి కలేక్షనలను నమోదు చేస్తోంది. ‘ఇష్క్’ సినిమా నితిన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయితే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నితిన్ కెరీర్ లో నిలిపోయే సినిమా అవుతోంది. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నికిత రెడ్డి నిర్మించారు. ఇషా తల్వార్, మధు నందన్, అలీ లు ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ సినిమా విజయాన్ని గురించి నితిన్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా ఇంతటి విజయాని సాదించినందుకు నేను ముందుగా మా నాన్న సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పాలి. ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ కి ఈ సినిమా టీం అంతా చాలా సంతోషం గా వున్నాము. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాదించడానికి కారణం మా టీం చేసిన హార్డ్ వర్క్. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ సినిమా విజయాన్ని సాదించడానికి చాలా సహాయ పడ్డాయి. హర్ష వర్ధన్ నా బాడీ లాంగ్వేజ్ కి, నా మైండ్ కి తగినట్టుగా డైలాగులను రాశారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం ఫెంటాస్టిక్. నేను ఆయనతో తీసిన మొదటి సినిమా అయిన చాలా చక్కగా తెరకెక్కించారు. కొరియోగ్రాఫర్ శేఖర్ రీమిక్స్ చేసిన ‘ఏమైందో ఈ వేల’ పాటకి మంచి స్టెప్స్ కి కంపోస్ చేశారు. ఈ సినిమాలో చాలా మంది కొత్త వారికి అవకశం ఇవ్వడం జరిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాదించినందుకు నాకు చాలా హ్యాపీ గా వుంది’.
విజయ్ కుమార్ కొండ టీం అందరికి థాంక్స్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ ప్రతి లవ్ స్టోరీకి మంచి విసువల్స్ అవసరం. ఆండ్రూ చక్కని సినిమాటోగ్రాఫిని అందించారు. నితిన్ పెర్ఫామెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. సినిమా క్లైమాక్స్ లో తన నటన చాలా బాగుంది

తాజా వార్తలు