జీనియస్ స్క్రీన్ ప్లేకి నేషనల్ అవార్డ్ వస్తుంది : దాసరి కిరణ్

జీనియస్ స్క్రీన్ ప్లేకి నేషనల్ అవార్డ్ వస్తుంది : దాసరి కిరణ్

Published on Dec 24, 2012 1:00 PM IST

Genius_dasari_kiran

ఓంకార్ డైరెక్షన్లో తెరకెక్కిన జీనియస్ డిసెంబర్ 28న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ‘ఏ’ సర్టిఫికేట్ దక్కించుకుంది. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నానని నిర్మాత దాసరి కిరణ్ అన్నాడు. ఈ సినిమా కథా బలం వల్లే ఇన్ని అవాంతరాలు ఎదురయ్యాయని అన్ని అవాంతరాలు దాటుకుని ఈ నెల 28న సినిమాని భారీగా విడుదల చేస్తున్నాము. 300కి స్క్రీన్స్ లో జీనియస్ సినిమాని విడుదల చేస్తున్నాము. నైజాం ఏరియాలో మల్టి డైమన్షన్ సంస్థ వారు ఈ సినిమాని 150కి పైగా ధియేటర్ లలో విడుదల చేస్తుండగా, సీడెడ్ ఏరియాలో దాసరి నారాయణ రావు, ఉత్తరాంధ్ర ఏరియాలో సురేష్ ఫిల్మ్స్, గుంటూరు, కృష్ణా ఏరియాలకు గాను మైత్రి పిక్చర్స్ వారు ముందుకొచ్చి విడుదల చేస్తున్నారని ఆయన అన్నాడు.

తాజా వార్తలు