హాలీవుడ్ సినిమా తరువాత రాజ్ దాసిరెడ్డి తెలుగులోనే…!

హాలీవుడ్ సినిమా తరువాత రాజ్ దాసిరెడ్డి తెలుగులోనే…!

Published on Jun 22, 2020 11:41 PM IST

ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ”తో హీరోగా పరిచయమైన రాజ్ దాసిరెడ్డి హీరోగా తెలుగులో మరో సినిమా త్వరలో మొదలు కానుంది. “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” అనంతరం ‘మెర్సిడీస్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు రాజ్ దాసిరెడ్డి. ఈ చిత్రం ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, 2022లో విడుదల కానుంది.

హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం కారణంగానే రాజ్ దాసిరెడ్డి “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” సినిమా తరువాత వెంటనే తెలుగులో సినిమా చేయలేకపోయాడట. కాగా ఇప్పుడు మాతృభాష పై గల మక్కువతో త్వరలోనే మరో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు రాజ్ దాసిరెడ్డి. హీరో – హీరోయిన్ మినహా దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం చెబుతుంది. మరి ఈ సినిమాతోనైనా రాజ్ దాసిరెడ్డికి తెలుగులో మంచి హిట్ రావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు