తలైవర్ కంబ్యాక్ కు సీక్వెల్ రాబోతోందా?

తలైవర్ కంబ్యాక్ కు సీక్వెల్ రాబోతోందా?

Published on Jun 18, 2020 6:34 PM IST


తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటిన చిత్రం “కబాలి”. ఈ చిత్రం రజినీకి ఎంతైతే హైప్ తీసుకొచ్చిందో అంతే స్థాయి నష్టాన్ని కూడా మిగిల్చింది. రజినీని ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ రోల్ లో ఇష్టపడే చాలా మందికే ఈ చిత్రంతో కూడా బాషా టైపు సాలిడ్ హిట్ అందుతుంది అనుకున్నారు.

కానీ అది కాస్తా తల కిందులు అయ్యింది. కానీ ఆ సినిమాతో రజినీ ఫ్యాన్స్ లో ఆ ఫీల్ రాలేదు కానీ జెనరల్ ఆడియెన్స్ కు మాత్రం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో తీసిన “పేట” తో ఆ ఫీల్ వచ్చింది. ఇప్పుడు అలాంటి కంబ్యాక్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ చియాన్ విక్రమ్ తో ఓ సినిమాను కమిట్ అయ్యారు. మరి ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు