రెండు తెలుగు రాష్ట్రాలు చిత్రాల షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జూన్ 15నుండి అధికారికంగా షూటింగ్స్ మొదలుపెట్టవచ్చని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పర్మిషన్స్ వచ్చినా షూటింగ్స్ మొదలుపెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తుంది. కొన్ని చిన్న చిత్రాలు, సీరియల్స్ మరియు టీవీ షోల షూటింగ్ మొదలైంది. ఐతే పూర్తి స్థాయిలో పెద్ద చిత్రాల షూటింగ్ మొదలుకాలేదు. దీనితో టాలీవుడ్ లో అంతగా సందడి చోటు చేసుకోలేదు.
మరో వైపు ఇతర రాష్ట్రాల నటులు షూటింగ్స్ కొరకు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది. ముఖ్యంగా ముంబై నటులు ఎవ్వరూ హైదరాబాద్ కి షూటింగ్ కి రావడానికి ఇష్టపడం లేదు. ఇప్పటికే కొందరు ముంబై నటులు తెలుగు సినిమాలకు కమిటై ఉన్నారు. వారు కూడా కరోనా భయంతో ఇల్లు కదలడానికి ఇష్టపడం లేదట. లాక్ డౌన్ సడలింపుల తరువాత కరోనా వ్యాప్తి అధికం కావడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.