మహేష్-విజయ్ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందట

మహేష్-విజయ్ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందట

Published on Jun 13, 2020 7:05 PM IST


ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ టాప్ స్టార్స్ అయిన విక్రమ్, కార్తీ, జయం రవిలతో పాటు మోహన్ బాబు, ఐశ్వర్యారాయ్, త్రిషా వంటి భారీ క్యాస్టింగ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత మేర ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఐతే ఈ మూవీ నాలుగేళ్ళ క్రితం సూపర్ స్టార్ మహేష్, తలపతి విజయ్ తో చేయాలనున్నారట.

మరి మణిరత్నం ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఎందుకు ప్రాజెక్ట్ చేయలేదో, ఆయన భార్య సుహాసిని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. నాలుగేళ్ళ క్రితం ఈ భారీ పీరియడ్ డ్రామాకు మణిరత్నం ఆలోచనలకు తగ్గట్టుగా వి ఎఫ్ ఎక్స్ వర్క్ చేసే టీమ్ దొరకలేదట. దీనితో మహేష్, విజయ్ లతో పొన్నియిన్ సెల్వన్ చేద్దామనుకున్న ఆలోచన ఆయన విరమించుకున్నారట. ఒక వేళ అప్పుడు ఆ ప్రాజెక్ట్ సాకారం అయితే, రెండు పరిశ్రమలకు చెందిన టాప్ స్టార్స్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ అయ్యేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు