మీరా చోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేసులో పురోగతి.

మీరా చోప్రా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేసులో పురోగతి.

Published on Jun 9, 2020 2:54 PM IST

కొద్దిరోజలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ మీరా చోప్రా సోషల్ మీడియా చాట్ లో తాను ఎన్టీఆర్ ఫాన్ ని కాదు , ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు అని చెప్పారు. దీనిపై సీరియస్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనితో సోషల్ మీడియా వేదికగా తనపై వేధింపులకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది.

మీరా చోప్రా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి 15 ట్విట్టర్ అకౌంట్స్ ని గుర్తించారట. వారిలో 10 మంది తమ ట్విట్టర్ అకౌంట్స్ ని డిలీట్ చేసుకున్నట్లు గుర్తించారు. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టనున్నారు. చిన్న వివాదంగా మొదలైన ఈ కేసు రాను రాను మరింత పెద్దదిగా పరిణామం చెందుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు