స్పెషల్ అప్డేట్ తో ప్రభాస్ మేకర్స్ ..?

స్పెషల్ అప్డేట్ తో ప్రభాస్ మేకర్స్ ..?

Published on May 19, 2020 12:07 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ పై ఒకింత అసహనంతో ఉన్నారు. సాహో విడుదల తరువాత కొంత విరామం తీసుకున్న ప్రభాస్ లాక్ డౌన్ ముందు వరకు షూటింగ్ లో పాల్గొన్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ లవ్ డ్రామా చివరిగా జార్జియాలో షూటింగ్ జరుపుకుంది. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ మూవీపై ఎటువంటి అప్డేట్ లేదు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘమైన బ్రేక్ పడగా, ఈ ఏడాది మూవీ విడుదల అయ్యే సూచనలు కూడా లేవని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కనీసం ప్రభాస్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. సమీప కాలంలో రాబోయే ఓ స్పెషల్ అకేషన్ పురస్కరించుకొని, టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారట. ఇక ఈ మూవీకి జాను అనే వర్కింగ్ టైటిల్ ఉండగా ఆ టైటిల్ దిల్ రాజు వీరి దగ్గర నుండి అరువు తీసుకొని 96 రీమేక్ కి వాడుకున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ మూవీకి ఓ సాఫ్ట్ టైటిల్ కోసం వెతుకుతున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు