ఆర్ ఆర్ ఆర్ టీం నిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా చూసి ఎంజాయ్ చేద్దాం ఆకాశమంత ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ని ఓదార్చడానికి… నచ్చజెప్పడానికి ఎన్టీఆర్ స్వయంగా దిగారు. ఓ ఎమోషనల్ లెటర్ తో వారిని కన్వీన్వ్ చేసే ప్రయత్నం చేశారు.
కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అన్ని దారులు మూసుకుపోయాయి. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో రాకున్నా కనీసం సేవా కార్యక్రమాలతో పాటు వేడుకలతో హంగామా చేద్దాం అనుకుంటే.. బయట తిరగలేని పరిస్థితి ఉంది. మే 18తో లాక్ డౌన్ ముగుస్తుందని భావించిన వారు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. లాక్ డౌన్ పొడిగింపుతో పాటు, వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ పిలుపునివ్వడం జరిగింది. గత ఏడాది కూడా వేడుకలు నిరాకరించిన ఎన్టీఆర్, మరో మారు ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చారు.