ప్రతీ ఏడాది ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. అందుకే మే 20న నందమూరి ఫ్యాన్స్ కు ప్రత్యేకం. పైగా ఎన్టీఆర్ కూడా ఆ రోజు వీలైనంత వరకు ఫ్యాన్స్ మధ్యలోనే ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ రోజు ఎవరు వచ్చినా కూడా కాదనకుండా పలకరిస్తూ.. వాళ్లతోనే తన సమయం గడుపుతుంటాడు. అయితే ఈ సారి మాత్రం అలాంటి సంబరాలు లేవు.
కరోనా నేపద్యంలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా ఈ సారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని తారక్ తన ఫ్యాన్స్ కు ఒక లెటర్ రిలీజ్ చేస్తూ.. ‘ప్రతి ఏటా నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ చేసే సేవ కార్యక్రమాలు ఓ ఆశీర్వచనంగా భావిస్తాను. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటిపట్టునే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం ‘అంటూ లేఖను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ గురించి కూడా మాట్లాడుతూ అభిమానుల నిరాశను పోగొట్టే ప్రయత్నం చేశారు.
https://twitter.com/tarak9999/status/1262333279794892801/photo/1