నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా అప్ డేట్ గురించి నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అయితే కరోనా కారణంగా కొన్ని పనులు లేట్ అయ్యాయి, అయితే స్క్రిప్ట్ కి టైం దొరకినందుకు హ్యాపీ, ఇక ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం క్యాస్టింగ్ గా ఎవర్ని తీసుకోవాలో అని కొన్ని ఐడియాలు ఉన్నాయి, కానీ ఇప్పటివరకూ ఎవర్ని ఫైనల్ చెయ్యలేదు. ఇంకా టైం పడుతుంది’ అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ చేశాడు.
కాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు.
Script, previs works jarugutunnayi….corona valla konni delay ayyayi… but script ki ekkuva time so ????…casting ideas unnayi kaani evarini finalise cheyale… Inka time undi…
— Nag Ashwin (@nagashwin7) May 17, 2020