కొద్దిరోజులుగా సూర్య మరియు తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం నడుస్తుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆయన నిర్మించిన పోన్మగళ్ వందాల్ మూవీని నేరుగా డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో సూర్య సినిమాలు నిషేదిస్తాం అని హెచ్చరించారు.
ఐతే వారి బెదిరింపులను లెక్క చేయని సూర్య అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని అందుబాటులోకి తెచ్చాడు. నెల 29నుండి ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఐతే తన ఈ నిర్ణయాన్ని సూర్య సమర్ధించుకున్నాడు. అయన మాట్లాడుతూ “నా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారా? నాబిజినెస్ నేను చేసుకుంటా. సినిమా హిట్ అయినప్పుడు ఓవర్ ఫ్లో కూడా ఎగ్గొట్టే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నన్ను ప్రశ్నించడం కామెడీగా ఉంది. నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలను ఇకపై ఓటీటీలోనే రిలీజ్ చేస్తాను. వాటికి తగ్గట్టుగానే నా సినిమాల బడ్జెట్ ఉంటుంది. నాకు 70 కోట్ల అప్పు ఉంది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అన్నారు.