సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ‘యువరాజు’ మూవీ ప్రత్యేకమైనది. మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు అలాగే యూత్ కు బాగా దగ్గర చేసిన సినిమా ఇది. ఇక యువరాజు చిత్రానికి నేటితో అప్పుడే 20 ఏళ్ళు నిండిపోయాయి. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కి వచ్చిన స్టార్స్ తో మహేష్ దిగిన పై ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
మహేష్ బాబు మధ్యలో ఇరువైపుల విక్టరీ వెకంటేష్ మరియు నాగార్జున ఉన్నారు. అలాగే అప్పటి మహేష్ యంగ్ లుక్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది, దానితో పాటు కింగ్ నాగ్ స్టైలిష్ లుక్, అలాగే బ్లాక్ స్పెట్స్ తో వెంకీ స్మైల్ అప్పటి ఈ ఫొటోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫొటోలో యువరాజు చిత్ర దర్శకుడు వై.వి.యస్.చౌదరి కూడా ఉండటం విశేషం.
ఇక మహేష్ను “ప్రిన్స్”గా మార్చిన చిత్రమిదే.ఈ సినిమా నుండే మహేష్ కు ఆ బిరుదు వచ్చింది. పైగా ఎలాంటి ప్రయోగాన్నైనా చేయడానికి ముందుండే మహేష్.. యంగ్ ఏజ్ లోనే అదీ రెండో సినిమాతోనే తండ్రి పాత్రలో నటించి మెప్పించడం మహేష్ కే చెల్లింది. వై.వి.యస్.చౌదరి తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించారు.
అయితే వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో మళ్ళీ మహేష్ నటించలేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ గా ‘యువరాజు’ నిలిచిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిమ్రన్, సాక్షి శివానంద్ కథానాయికలుగా నటించగా… వెంకట్, చంద్రమోహన్, శివాజి, అలీ, ముఖ్య పాత్రలు పోషించారు.