మా పిల్లలను తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యాన్ని కోరాను – త్రివిక్రమ్

మా పిల్లలను తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యాన్ని కోరాను – త్రివిక్రమ్

Published on Nov 29, 2012 6:00 PM IST

దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. కాని ప్రస్తుతం స్వచ్చమయిన తెలుగు కరువయిపోతుంది దీని మీద చర్యలు తీసుకుంటూ ప్రబుత్వం తెలుగుని తప్పనిసరి చేసింది ఈ విషయమై స్పందిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ప్రముఖ దిన పత్రికతో ఇలా అన్నారు “ఇప్పటికే తెలుగు 90% పోయింది ఎవరి తల్లిని వారు మరిచిపోతే ఎలా, ఇంగ్లీషు కొంచెం ఆలస్యంగా అయినా వస్తుంది అవసరం కాబట్టి. కానీ తెలుగు ఇప్పుడు రాకపోతే ఎప్పుడూ రాదు. మా పిల్లలను స్కూల్లో తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యానికి చెప్పాను. వాళ్లూ సరేనన్నారు.” అని అన్నారు. పద్యాల పోటీలు, భగవద్గీత శ్లోకాల పోటీలు, అన్నమయ్య కీర్తన పోటీలు, రామాయణంలో చిన్న ఘట్టంలో నటింపజేయడం లాంటివి చేస్తే తెలుగు ఉనికిని కాపాడుకోవచ్చని త్రివిక్రమ్ చెప్పారు. తెలుగు భాషంటే అందరికి ఇష్టమే అవసరం లేదు కాబట్టి మరిచిపోతున్నారు. ఇపుడు తప్పనిసరి చెయ్యడంతో తెలుగు భాష గొప్పతనం ఏంటో అందరికి తెలుస్తుంది. ఇది నిజంగా మంచి తరుణం.

తాజా వార్తలు