‘ఒరేయ్‌ బుజ్జిగా’.. మొబైల్ పబ్లిసిటిలో కూడా !

‘ఒరేయ్‌ బుజ్జిగా’.. మొబైల్ పబ్లిసిటిలో కూడా !

Published on Mar 11, 2020 1:23 AM IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ దర్శకత్వంలో వస్తోన్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’. కాగా ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌ కానుంది. దాంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది అందులో భాగంగా మొబైల్ పబ్లిసిటి అనే ఒక కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టుంది చిత్రబృందం.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు కలిగిన వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతాయి. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై ఏమైంది ఈ వేళ‌, బెంగాల్ టైగ‌ర్‌ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌ గా కార్తి ఖైదీ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్, ఆయనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు