రానా, నయనతారలు ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుం” ఒక్క పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే “రంగ మార్తాండ బి.టెక్ బాబు” అనే పాటను రానా,రఘు బాబు మరియు ఇతర నటుల మీద చిత్రీకరించారు. రానా ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో గాయాల పాలయ్యారు. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ కానుంది. క్రిష్ మొదటి సారిగా పూర్తి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిబాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా వి ఎస్ జ్ఞాన శేకర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి. “నా ఇష్టం” చిత్రం తర్వాత రానా చేస్తున్న చిత్రం కాగా నయనతార “శ్రీ రామ రాజం” చిత్రం తరువాత చేస్తున్న చిత్రం ఇది.
దాదాపుగా పూర్తయిన కృష్ణం వందే జగద్గురు
దాదాపుగా పూర్తయిన కృష్ణం వందే జగద్గురు
Published on Sep 14, 2012 12:01 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
- పెద్ది ‘సుందరి’కి పెద్ద పరీక్షే..!
- టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు
- ‘ఘాటి’ ప్రమోషన్స్కు అనుష్క నో.. వర్కవుట్ అయ్యేనా..?
- ‘మిరాయ్’ కోసం రంగంలోకి హోంబలే ఫిల్మ్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?