‘సీమంతం’ చిత్రం మంచి హిట్ అందుకోవాలి – ఆర్.పి.పట్నాయక్

Seemantham

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘సీమంతం’. ఈ సినిమాలో వజ్రయోగి హీరోగా, శ్రేయ భర్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుధాకర్ పాణి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ‘యద మాటున’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ‘మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సీమంతం సినిమా విజయం సాధించాలి. అందరికి మంచి పేరు రావాలని, నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలి’ అని ఆయన ఆకాంక్షించారు.

ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంగీతం ఎస్.సుహాస్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విజువల్స్, మ్యూజిక్ లెవెల్ చాలా హై స్టాండర్డ్‌లో ఉండబోతున్నాయని మేకర్స్ తెలిపారు. నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.

Exit mobile version