గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ బ్లాక్బస్టర్ చిత్రంగా నిలిచింది ‘రంగస్థలం’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్లోనే బెస్ట్ అని అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి సౌండ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ, ఈ చిత్రం ఈసారి సౌండ్ చేసేది థియేటర్లలో కాదు.. బుల్లితెరపై. రామ్ చరణ్ సినిమాలకు ఉత్తరాదిన మాంచి క్రేజ్ ఉంటుంది. అలాంటిది.. రంగస్థలం చిత్రం కోసం అక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని 7 ఏళ్ల తర్వాత తొలిసారిగా హిందీ భాషలో బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా తీసుకొస్తున్నారు.
గోల్డ్మైన్స్ టీవీ ఛానల్లో రంగస్థలం చిత్రాన్ని ఆగస్టు 24న రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాకు సాలిడ్ టీఆర్పీ రేటింగ్స్ రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా రాక్స్టార దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.