పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘బ్యాచిలర్స్ ప్రేమకథలు’

యస్.యం.4 ఫిలిమ్స్ బ్యానర్ పై గీతా సింగ్, కార్తీక్ , కాశీ మదన్, ఇషాని, చలానా అగ్నిహోత్రి, శృతి లయ నటీనటులుగా యం.యన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “బ్యాచిలర్స్ ప్రేమకథలు”. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకులు వి.సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ దర్శకులు వీర శంకర్ క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక,నిర్మాత, సాగర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు నేను తీసిన “కాలం రాసిన కథలు” సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతో దానికి సీక్వెల్ గా ‘బ్యాచిలర్స్ ప్రేమ కథలు’ సినిమా తీస్తున్నాను” ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి షోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. అలాగే ఇందులో కూడా నూతన నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసుకొని 2025 లోనే విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

నటి గీతా సింగ్ మాట్లాడుతూ.. ‘అడియన్స్ అందరూ నా పాత్రకు కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేయబోతున్నాను. ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు అని అన్నారు.

నటుడు కార్తీక్ మాట్లాడుతూ.. యూత్ మెచ్చే మంచి మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సాగర్ గారికి నా ధన్యవాదాలు.

నటి ఇషాని మాట్లాడుతూ.. బెంగళూరులో మోడలింగ్ చేస్తూ సినిమాలో నటించాలని హంటింగ్ చేస్తున్న నాకు యస్.యం.4 ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న “బ్యాచిలర్స్ ప్రేమ కథలు” సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత సాగర్ గారికి నా ధన్యవాదాలు.

Exit mobile version