‘జాక్’ నిర్మాతకు సగం రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ

హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇటీవల ‘జాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో ఈ సినిమా నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. అయితే, ఈ సినిమా ఫ్లాప్ కావడంతో హీరో సిద్ధు తన రెమ్యునరేషన్ నుంచి సగం నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు. ఈ సినిమా నష్టా్న్ని మిగిల్చడంతో హీరో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు.

ఇక ఈ సినిమాలో సిద్ధు సరసన యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు అచ్చు రాజమణి, సామ్ సి.ఎస్, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు.

Exit mobile version