కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ “థగ్ లైఫ్” జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాలు మీకు అందించడం నా బాధ్యత. నేను 15 తెలుగు సినిమాలు చేస్తే అందులో 13 విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఈ విజయాల్ని మీరే ఇచ్చారు. ప్లాప్స్ మాత్రమే నేను ఇచ్చాను. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి “థగ్ లైఫ్” సినిమా మీకు అందిస్తున్నాను. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించారు. అభిరామి గారు అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. నాజర్ గారితో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన లాంటి నటుడు దొరకడం చాలా కష్టం. త్రిష పెర్ఫార్మెన్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా గొప్ప సినిమా చేశామని మేము నమ్ముతున్నాం. జూన్ 5న మేము అనుకున్నది కరెక్టా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను. జూన్ 5న అందరం థియేటర్స్ లో కలుద్దాం’ అని అన్నారు.
హీరో శింబు మాట్లాడుతూ..‘తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఓజీలో ఒక పాట పాడాను. పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీ తో తీరింది.’ అని అన్నారు.
హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. ‘వర్షం సినిమా రిలీజై 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్ కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. కచ్చితంగా మీకు నచ్చుతుంది’ అని అన్నారు.
ఇక ఈ ఈవెంట్లో నటుడు నాజర్, నటి అభిరామి, శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.