ఓదెల 2, అర్జున్ S/O వైజయంతి.. అసలైన పరీక్ష రేపట్నుంచే!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈవారం రెండు చిత్రాలు మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘ఓదెల 2’, ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ పాత్రలో నటించిన ఓదెల 2 సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సంపత్ నంది నిర్మాణంలో అశోక్ తేజ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

ఇక మదర్ సెంటిమెంట్‌తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘అర్జున్ S/O వైజయంతి’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ ఓపెనింగ్స్ లభించాయి. ఇక వీకెండ్‌లో ఈ సినిమాలకు కొంతమేర ఆడియెన్స్ రెస్పాన్స్ దక్కుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ చిత్రాలకు అసలైన పరీక్ష సోమవారం నుండి మొదలుకానుంది. వీక్ డేస్‌లో ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటాయా.. అనేదానిపై ఈ చిత్రాల ఫలితం ఆధారపడింది. మరి ఈ రెండు సినిమాలు మండే టెస్ట్‌లో పాస్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version