హిస్టారికల్ డ్రామాతో రాబోతున్న గోపీచంద్ !

యాక్షన్ హీరో గోపీచంద్, ఘాజీ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి ఒక ఉత్తేజకరమైన సరికొత్త ప్రాజెక్ట్‌ ను స్టార్ట్ చేశారు. ఈ చిత్రం గోపీచంద్ సినీ కెరీర్ లో 33వ సినిమాగా రాబోతుంది. కాగా ఈ రోజు హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమంతో నటీనటులు మరియు చిత్ర సిబ్బంది మధ్య ఈ సినిమా లాంచ్ అయింది. అన్నట్టు ఈ ప్రతిష్టాత్మక హిస్టారికల్ డ్రామా 7వ శతాబ్దంలో సాగనుంది.

కాగా త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించబడుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్ మరియు ఈ సినిమాలో నటించే మిగిలిన తారాగణంతో సహా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు.

Exit mobile version