మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గత్ గత ఏడాది సమ్మర్ లో లూసిఫర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. పొలిటికల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్ర రీమేక్ హక్కులను రామ్ చరణ్ దక్కించుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చిరంజీవి హీరోగా ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయనున్నారు. దర్శకుడు సుజీత్ ఇప్పటికే లూసిఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ సిధ్దం చేస్తున్నాడు. ఆయనే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉన్న సల్మాన్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించే అవకాశాలు లేవు. ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమా రంజాన్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఐతే లాక్ డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. కభీ ఈద్ కభీ దివాళి అనే చిత్రంలో కూడా సల్మాన్ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తి చేయడమే సల్మాన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.