రామ్ ‘రెడ్’ కోసం డిజిటల్ ఫైట్ !

రామ్‌ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘రెడ్’. కాగా ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ఓ డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా, చిత్రబృందం ఆ ఆఫర్ ను రిజక్ట్ చేసింది. డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం చేసుకోవడానికి.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓటిటి ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయట. నెట్ ఫ్లిక్స్ నుండి కాస్త పెద్ద ఆఫరే ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

Exit mobile version