రెబెల్ స్టార్ ప్రభాస్ తాను ప్రత్యేకం అని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన ఏకంగా 4కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. కరోనా వైరస్ పై పోరాటంలో భాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా ఆయన 4 కోట్ల భారీ విరాళం ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి 3కోట్లు తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభాస్ టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ విరాళం ప్రకటించి పాన్ ఇండియా స్టార్ అనిపించాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.