తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గడిచిన సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్ తదితర నేతలు పాల్గొని వీరజవానుకు నివాళ్లర్పించారు.
కాగా తాజాగా యువ హీరో విశ్వక్ సేన్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను కలిసి దైర్యం చెప్పారు. ఇక ప్రభుత్వం సైతం సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని.. ఇంటి స్థలం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.