వాయిదాపడిన రామ్ చరణ్ ఎవడు చిత్రం

వాయిదాపడిన రామ్ చరణ్ ఎవడు చిత్రం

Published on Jul 27, 2013 6:21 PM IST

Yevadu1
రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల నడుమ జరుగుతున్న హై డ్రామా నేపధ్యంలో ఈ సెగ మన టాలీవుడ్ కు సైతం సాకింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఆగష్టు 21కి వాయిదాపడింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ నెల 31కి విడుదల చేద్దామనుకున్నారు, అయితే ప్రత్యేక తెలంగాణా నేపధ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఆగష్టు 2న తమ నిర్ణయం తెలిపే ఆస్కారం వున్న కారణాన ఆ తేదిలలో గొడవల జరిగే అవకాశం వుంది కనుక ఈ సినిమాను సేఫ్ డేట్ కు వాయిదా వేసారు. ఈ సినిమాను చిరంజీవి పుట్ట్టినరోజు కానుకగా ఆగష్టు 21న విడుదల చేస్తామని తెలిపారు. శృతిహాసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

తాజా వార్తలు