రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ జూలై 31న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరికొత్త గెటప్తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.
కాగా, రీసెంట్గా ఈ చిత్ర ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, ఈ చిత్రానికి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఇదే చిత్ర యూనిట్కు కొత్త సమస్య తెచ్చిపెట్టింది. టికెట్ రేట్లు జూలై 31 నుంచి పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ చిత్ర ప్రీమియర్స్ జూలై 30న వేయనున్నారు.
దీంతో ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్గా నటిస్తోండగా సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.