పవన్ తో వర్క్ అవుట్ కాలేదు.. మరి మహేష్ తోనైనా..?

హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలే. ఐతే స్టార్ డమ్ విషయంలో తక్కువేం కాదు. ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన మహానటి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మహానటి తర్వాత ఆమె ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది. అందుకే వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె సైన్ చేస్తుంది. ఆమె నటించిన పెంగ్విన్ మూవీ రేపు విడుదల కానుంది.

కాగా టాలీవుడ్ లో కీర్తి సురేష్ జత కట్టిన మొదటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్. 2018లో సంక్రాంతి కానుకగా విడుదలైన అజ్ఞాతవాసి మూవీలో కీర్తి ఓ హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ చిత్రం పరాజయం పాలైంది. కాగా మరో స్టార్ హీరో మహేష్ కి జంటగా కీర్తి నటించనుంది అని వార్తలు వస్తున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలో కీర్తి దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మరి పవన్ తో హిట్ అందుకోలేకపోయిన కీర్తి మహేష్ తో భారీ కమర్షియల్ హిట్ కొడుతుందేమో చూద్దాం..

Exit mobile version