ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కుబేర’. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ నాగార్జున ఏం మాట్లాడారు అంటే ఆయన మాటల్లోనే విందాం.
నాగార్జున మాట్లాడుతూ..‘నాకు ధనుష్తో కలిసి నటించినందుకు హ్యాపీగా ఉంది. ధనుష్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేం పాత్రధారులం మాత్రమే. శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా ఇది. మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ‘మాయాబజార్’ సినిమాలో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీ రంగారావు.. వీరిలో హీరో ఎవరు ?, వారెవరూ కాదు కేవీ రెడ్డి (దర్శకుడు) హీరో. అలా కుబేర హీరో శేఖర్’ అంటూ నాగార్జున తెలిపారు.