టాలీవుడ్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఆయన ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్తో థ్యాంక్స్ మీట్ నిర్వహించాడు.
ఈ కార్యక్రమంలో విష్ణుతో పాటు మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ విలేకరి ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడిని ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు. దీనికి విష్ణు సమాధానమిస్తూ.. ‘టాలీవుడ్లో కన్నప్ప లాంటి సబ్జెక్ట్ను నాతో తెరకెక్కించేందుకు ఏ డైరెక్టర్ కూడా ముందుకు రారని బాలీవుడ్ దర్శకుల కోసం చూశానని.. అందులో భాగంగానే ‘మహాభారతం’ లాంటి ఎపిక్ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ను ఈ సినిమా కోసం తీసుకున్నామని విష్ణు తెలిపాడు.
ఇక తాము ఊహించిన దానికంటే ఆయన విజన్ చాలా గ్రాండ్గా ఉందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని విష్ణు అన్నాడు. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.