టాలీవుడ్ లోకి “బ్లాక్ రోజ్” గా ఎంట్రీ ఇస్తున్న ఊర్వశీ రౌతేల


బాలీవుడ్ భామ, మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల ఎట్టకేలకు టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. సంపంత్ నంది క్రియేట్ చేస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ బ్లాక్ రోజ్ లో ఊర్వశీ రౌతేల నటిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన శ్రీనివాసా చిట్టూరి బ్యానర్ పవన్ కుమార్ సమర్పణ లో ప్రొడక్షన్ నంబర్ 4 గా బ్లాక్ రోజ్ ను తెరకెక్కిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత శ్రీనివాసా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ రోజ్ చిత్ర యూనిట్ కి కొవిడ్19 పరీక్షలు నిర్వహించి షూటింగ్ జరుపుతున్నాం అని అన్నారు.

అయితే రెండు సార్లు మిస్ ఇండియా కిరీటం సాధించి, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా, బ్లాక్ రోజ్ కథ విన్న వెంటనే ఇంప్రెస్స్ అయి చిత్రానికి ఓకే చెప్పిన విషయాన్ని తెలిపారు. కరోనా సమయం లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం అని, ఓకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. అయితే షేక్స్ పియర్ రచించిన మర్చంట్ ఆఫ్ వెనిస్ లో షైలాక్ పాత్ర ఆధారం గా ఈ బ్లాక్ రోజ్ తెరకెక్కుతుంది అని సంపత్ నంది అన్నారు. విచక్షణ లేని, యోగ్యత లేని ఆర్ధిక లావాదేవీలు మరణానికి సంకేతం అని కౌటిల్యుడి అర్ద శాస్త్రం లోని కాన్సెప్ట్ ను జోడిస్తూ నిర్మిస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

Exit mobile version