పెళ్లి రోజు జరుపుకోవాలనిపించలేదు- ఉపాసన

పెళ్లి రోజు జరుపుకోవాలనిపించలేదు- ఉపాసన

Published on Jun 21, 2020 3:14 PM IST

ఈనెల 14న రామ్ చరణ్ మరియు ఉపాసన…పెళ్లి రోజు జరుపుకున్నారు. వారి వివాహ బంధం మొదలై ఎనిమిదేళ్లు పూర్తి అయ్యింది. ఐతే ఈ పెళ్లి రోజు వేడుకగా జరుపుకోవాలని ఉపాసనకు అనిపించలేదట. దానికి కారణం ఈ మధ్య వ్యక్తిగతంగా. సామాజికంగా అనేక దురదృష్ట సంఘటనలు చోటు చేసుకోవడమే అని ఉపాసన చెప్పారు.

ఈ విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ లో ఉపాసన ”గత 20 రోజులు గా అనేక సంఘటనలతో తాము బాధ పడ్డామని చెప్పారు ఆమె. తమ ఫ్యామిలీ లో ముగ్గురు పెద్ద వాళ్ళను కోల్పోయామని చెప్పారు. అదే విధంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తో పాటుగా దేశ రక్షణ గా ఉన్న జవాన్ లు మరణించడం, కరోనా కేసులు పెరగడం వంటి విషయాలు బాధించాయి. ఈ నేపథ్యంలో చాలా సింపుల్ గా తమ మ్యారేజ్ యానివర్సరీ ముగించినట్లు ఆమె చెప్పారు.

https://www.instagram.com/p/CBp1TWNDvaF/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు