శేఖర్ కమ్ములాకు థాంక్స్ చెప్పిన హిజ్రాలు.!

తన చిత్రాలతో మెస్మరైజ్ చేసే దర్శకుడు శేఖర్ కమ్ముల ఇతర దర్శకులతో పోలిస్తే కాస్త సైలెంట్ గానే తన పనులను చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది సినిమాలలో అయినా సరే బయట అయినా సరే అని చెప్పాలి. ప్రస్తుతం లాక్ డౌన్ మూలాన నెలకొన్న పరిస్థితులలో గ్రేటర్ హైదరాబాద్ మరియు కర్నూల్ జిల్లా పారిశుధ్య కార్మికులకు ఒక నెల రోజుల పాటు నిత్యావసర సరుకులను అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు.

దానితో వారంతా ఫ్లకార్డులను పట్టుకొని ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఇదే బాటలో సామాన్య ప్రజల కంటే ధైనమైన పరిస్థితులను ఎదుర్కొనే హిజ్రాలకు అండగా నిలిచి వారికోసం కూడా నిత్యావసర సరుకులను అందజేసి వారికి అండగా నిలిచారు. అలాగే తనతో పాటు అందరూ కూడా వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపును కూడా ఇచ్చారు.

“ఈ లాక్డౌన్ సమయంలో అత్యంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ట్రాన్స్ జెండర్లు. వాళ్ళు పడుతున్న కష్టాలని ఊహించలేం కుడా. అన్నం లేక, ఉంటానికి ప్లేస్ దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా బాధలు పడుతున్నారు. ఇవి కాక సమాజంలో వాళ్ళ పట్ల ఉండే వివక్ష, అపోహలు వాళ్ళ ఇబ్బందుల్ని ఇంకా పెంచుతున్నాయి. వాళ్ళకి అడ్రస్ ఉండదు, ఓటర్ కార్డ్ ఉండదు, రేషన్ కార్డ్ ఉండదు, ఆరోగ్య పథకాలు వర్తించవు, సెన్సిటివ్ గా ఉందాం, వాళ్ళని సపోర్ట్ చేద్దాం.అందుకు ఎవరన్నా కాంటాక్ట్ చేయాలి అంటే rachanamudraboyina@gmail.com అనే ద్వారా కావొచ్చని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెలుబుచ్చారు. వారి కోసం శేఖర్ చేసిన ఈ అమూల్యమైన ప్రయత్నానికి గాను హిజ్రాలు శేఖర్ కమ్ములకు తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version