మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి నిన్ననే క్రేజీ పోస్టర్స్ కూడా వచ్చి సందడి చేసాయి. అయితే వార్ 2 సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరుగుతుంది టాక్ ఉంది.
అయితే ఈ సినిమా హక్కులు ఎవరికీ ఇవ్వడం లేదని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తామే సొంతంగా విడుదల చేసుకుంటున్నారు అని తెలిసింది. అయితే ప్రస్తుతానికి టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పటికే ఆసక్తిగానే ఉన్నారట. అయితే మేకర్స్ మాత్రం ఇంకా ఎక్కువే ఆశిస్తున్నారట. దీనితో వార్ 2 బిజినెస్ ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి వార్ 2 ఎవరికి సొంతం అవుతుంది అనేది లేదా ఓన్ రిలీజ్ తోనే వస్తుందా అనేది.