కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకు కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ పీరియడ్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట 21 రోజులుగా ప్రకటించిన లాక్ డౌన్ ని మే వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా నిన్న సమావేశమైన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ షూటింగ్స్ పునఃప్రారంభం గురించి చర్చినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మూవీ షూటింగ్స్ మొదలు కావడానికి జులై చివరి వరకు పట్టే అవకాశం ఉందని చెప్పారట. ఇకవేళ ముందే షూటింగ్స్ కి అనుమతించినా, సెట్ లో 20-25 మంది టీమ్ మాత్రమే ఉండేలా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారట.
అంత తక్కువ మందితో ఓ మీడియం బడ్జెట్ మూవీని కూడా తెరకెక్కించలేం. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్వహించడం జరగనిపనే. ఈ నేపథ్యంలో ఆగస్టులో షూటింగ్ మొదలుపెట్టి ఎప్పటికి పూర్తి చేస్తారు అనేది సందేహంగా మారింది. ఇంత తక్కువ సమయంలో రాజమౌళి చెప్పిన విధంగా జనవరి 8కి మూవీని విడుదల చేస్తాడో లేదో చూడాలి.