రాజమౌళి డైరెక్షన్ లో చిరు-పవన్ మల్టీస్టారర్.. డిసైడ్ చేయాల్సింది ఎవరంటే..?

రాజమౌళి డైరెక్షన్ లో చిరు-పవన్ మల్టీస్టారర్.. డిసైడ్ చేయాల్సింది ఎవరంటే..?

Published on Apr 22, 2020 8:46 AM IST

టాలీవుడ్ ఎదురుచూస్తున్న అతిపెద్ద క్రేజీ కాంబినేషన్ చిరంజీవి-పవన్ ల మల్టీస్టారర్. చిరంజీవికి ఏమాత్రం తగ్గని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తో చిరంజీవి కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుండో మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గతంలో పవన్, చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో తళుక్కున మెరిశారే కానీ, పూర్తి స్థాయిలో నటించింది లేదు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడైనా వెండితెరపైకి రావాలని, ఆ సినిమా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

మరి రాజమౌళికి చిరు-పవన్ లతో మల్టీస్టారర్ చేసే ఆలోచన ఉందా లేదా అని అడిగితే ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. చిరు-పవన్ లతో నా మల్టీస్టారర్ ఉంటుందా అనేది మనం డిసైడ్ చేయలేం… అది స్క్రిప్ట్ డిసైడ్ చేయాలి. భవిష్యత్ ఏమిటో మనకు తెలియదు కాబట్టి, జరగొచ్చు జరగకపోవచ్చు అని చెప్పారు. మంచి స్క్రిప్ట్ సిద్ధమైన చిరు, పవన్ లు సమయం కేటాయిస్తే ఈ కాంబినేషన్ లో మూవీ రావడం అసాధ్యం కాదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు