టాలీవుడ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం విడుదలై 30ఏళ్ళు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర యూనిట్ అనేక విశేషాలు పంచుకున్నారు.ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ హీరో హీరోయిన్లు గా నటించిన చిరంజీవి, శ్రీదేవిలకు పారితోషికంగా ఎంత ఇచ్చారో చెప్పారు. చిరంజీవి ఈ సినిమా కోసం 35లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారట. ఇక హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న శ్రీదేవికి 25లక్షల రూపాయల పారితోషికం ఇచ్చారట.
బాల్కనీ టికెట్ కేవలం 6 రూపాయలు అమ్మిన ఆరోజుల్లోనే జగదేకవీరుడు అతిలోక సుందరి 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందట. దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. ఐతే ఈ సినిమా తరువాత చిరంజీవి పారితోషికం భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమా నాటికే చిరంజీవి పారితోషికం ఒక కోటి రూపాయలకు చేరింది. బాలీవుడ్ హీరోలు కుడా అప్పటికి కోటి రూపాయలు తీసుకోవడం లేదని ఓ ఇంగ్లీష్ డైలీ కథనం ప్రచురించింది.