ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు చిత్రాలకు కమిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ క్రిష్ జాగర్ల మూడితో తీస్తున్న చిత్రం. ఇప్పటి వరకు పవన్ ముట్టుకోని తరహా సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ కు గాను లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో కేవలం రెండు పాటలు పాత్రమే ఉంటాయి అని తెలియడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. కానీ సినిమాకు ఆయువు పట్టు అయినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విషయంలో మాత్రం ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. పాటలు తక్కువే ఉన్నా సరే కీరవాణి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అద్భుతంగా ఉంటాయని బజ్ వినిపిస్తుంది.