ఆర్ ఎక్స్ 100 సీక్వెల్ సిద్ధం చేస్తున్న అజయ్

ఆర్ ఎక్స్ 100 సీక్వెల్ సిద్ధం చేస్తున్న అజయ్

Published on Apr 26, 2020 12:34 PM IST

హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా 2018లోవచ్చిన ఆర్ ఎక్స్ 100 ఓ సంచలన విజయం నమోదు చేసింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కుర్రకారుని ఓ ఊపు ఊపింది. కార్తికేయకు ఈ చిత్రం మొదటి హిట్ కాగా పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె గ్లామర్ మరియు నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించాయి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీ నిర్మాతలకు కాసుల పంట పండించింది.

కాగా ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఆర్ ఎక్స్100కి సీక్వెల్ తీయనున్నాడట. ఇప్పటికే ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ కూడా పూర్తి చేశాడట అజయ్. ఇక ఆయన ప్రస్తుతం మహా సముద్రం అనే యాక్షన్ క్రైమ్ డ్రామాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. మహా సముద్రం మూవీ పూర్తయిన అనంతరం ఆయన ఆర్ ఎక్స్ 100 మూవీ పనులు పూర్తి స్థాయిలో మొదలుపెడతారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు