‘వీరమల్లు’పై బంద్ ఎఫెక్ట్.. ఫ్యాన్స్ ఆందోళన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాను పలుసార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు జూన్ 12న ఈ సినిమాను వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

కానీ, ఈసారి కూడా పవన్ సినిమా చెప్పిన టైమ్‌కు వచ్చేలా సూచనలు కనిపించడం లేదు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. వారి సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తామని వారు తెలిపారు. దీంతో జూన్ నెలలో రిలీజ్ అయ్యే చిత్రాల పరిస్థితి అయోమయంగా మారింది.

మరి వీరమల్లు చిత్రానికి ఈ బంద్ ఎఫెక్ట్ ఎంతమేర చేటు చేస్తుందో చూడాలి. ఈసారైనా తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలో అనౌన్స్ చేసిన సమయానికి అభిమానులు చూడగలుగుతారా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version