ఆఖరి పోరుకు సిద్ధమైన ది రాజాసాబ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది.

కాగా, ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతుందని.. ప్యాలెస్ సెట్‌లో ఈ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరపనున్నారట. ఈ షెడ్యూల్‌లో చిత్ర క్లైమాక్స్‌ను షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌ను జూలై ఫస్ట్ వీక్‌లో షూట్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version