ఫిలించాంబర్ లో నేడు సినీ డిస్ట్రిబ్యూటర్స్ కీలక సమావేశం.. ఈ అంశాలు చర్చకి

ఫిలించాంబర్ లో నేడు సినీ డిస్ట్రిబ్యూటర్స్ కీలక సమావేశం.. ఈ అంశాలు చర్చకి

Published on May 21, 2025 1:00 PM IST

మన తెలుగు సినిమా దగ్గర నిర్మాతలు, సినిమాలు లేనిదే థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు లేరు అదే విధంగా వీరూ లేకుండా వారు కూడా లేరు. అయితే మారుతున్న కాలంతో పాటుగా థియేటర్స్ లో సినిమాలు రన్ అవ్వడం అనేది కూడా ఒకింత క్లిష్టంగా మారుతూ వస్తుంది. అయితే ఇలా అనేక కారణాలతో రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ మూత పడనున్నాయి అంటూ పలు వార్తలు బయటకి వచ్చాయి.

అయితే పరిస్థితి అంత వరకు వెళ్లకుండా నేడు మే 21 సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో కీలక మీటింగ్ ఇపుడు జరగనుంది. ఇందులో ఎగ్జిబిటర్స్ సమస్యలు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతల వద్ద పెట్టనున్నారట. అయితే కీలకంగా ప్రస్తుతం కొనసాగుతున్న రెంటెడ్ విధానాన్ని తీసేసి షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వమని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారని మీటింగ్ లో చర్చించనున్నారట.

అలాగే ప్రస్తుతం సినిమా రిలీజ్ అయిన మొదటి వారం రెంట్ రెండోవ వారం షేరింగ్ విధానం అమలు అవుతుంది అయితే ఇప్పుడొస్తున్న సినిమాలు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయి రెండోవారం కలెక్షన్స్ వుండడం లేదు అని అందుకే మొదటి వారంలో రెంట్ విధానం కాకుండా షేర్ ని పంచుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నట్టుగా తెలిపారట. మరి ఈ అంశాలు మీదనే ప్రధానంగా నేడు ఈ మీటింగ్ జరగనుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు