అప్పటివరకు టాలీవుడ్ కి పనిలేదు..!

అప్పటివరకు టాలీవుడ్ కి పనిలేదు..!

Published on May 12, 2020 8:57 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణా సీఎం కే సి ఆర్ లాక్ డౌన్ నెల 29 వరకు పొడిగించారు. ఐతే కేరళ, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితో తెలంగాణాలో కూడా ఈవెసులుబాటు ఉంటుందని టాలీవుడ్ మేకర్స్ కొందరు అనుకున్నారు.

ఐతే లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ఎటువంటి సినిమా పనులు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. తెలంగాణా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు దీనిపై స్పష్టత ఇచ్చారు. మే 29వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సినిమాలకు సంబందించిన ఎటువంటి వర్క్స్ నిర్వహించరాదని తెలంగాణా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. లాక్ డౌన్ కారణంగా నష్టాల పాలవుతున్న నిర్మాతలకు తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు