‘మైసా’ను వెంటాడుతున్న ‘పుష్ప 2’ విలన్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘థామా’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేస్తోంది రష్మిక.

ఈ సినిమాల తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ‘మైసా’ అనే చిత్రాన్ని ప్రకటించింది ఈ స్టార్ బ్యూటీ. ఈ చిత్రాన్ని రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించే కంటెంట్‌తో రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నటుడు తారక్ పొన్నప్ప నటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు.

తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈ నటుడు ‘పుష్ప-2’లో తన విలనిజంతో మెప్పించాడు. ఇక ఇప్పుడు రష్మిక నటిస్తు్న్న ‘మైసా’ చిత్రంలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version